జనప్రియలోకి స్వామిహ్‌ పెట్టుబడి

Posted on: October 21, 2021 Posted by: Janapriya Comments: 0

జనప్రియలోకి స్వామిహ్‌ పెట్టుబడి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 20: నిధుల కొరతతో మధ్యలో నిలిచిపోయిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వామిహ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌-I రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన జనప్రియ నిర్మిస్తున్న సితారా లేక్‌ఫ్రంట్‌ ప్రాజెక్టులోకి రూ.136 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.149 కోట్లు. 8.212 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సితారా లేక్‌ఫ్రంట్‌ ప్రాజెక్టులో 1502 అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా జనప్రియ చైర్మన్‌ కే రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణం వచ్చే మూడేండ్లలో పూర్తికానున్నట్లు, వీటిలో 2,245 గృహాలు తక్కువ ధర కలిగినవని చెప్పారు.

 

Source: ntnews.com

Leave a Reply: